ఆంధ్రప్రదేశ్‌

సహజసిద్ధ వ్యవసాయంతోనే ఆర్థిక స్వావలంబన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, సెప్టెంబర్ 15: రైతులకు ఆర్థిక స్వావలంబన సహజసిద్ధమైన వ్యవసాయ విధానంతోనే సాధ్యమని పద్మశ్రీ సుభాష్ పాలేకర్ అన్నారు. తిరుపతి గత నాలుగు రోజులుగా జరుగుతున్న సహజసిద్ధమైన వ్యవసాయ శిక్షణా తరగతులుల ముగిసిన అనంతరం గురువారం ఆయన రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రధాన కార్యదర్శి విజయ్‌కుమార్‌తో కలిసి విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో 75లక్షల హెక్టార్లలో రైతులు వ్యవసాయం చేస్తున్నారన్నారు. ఇందుకోసం రూ.35 లక్షల కోట్లు రసాయనిక ఎరువులపై పెడుతున్నారన్నారు. ఈ భారం రైతుపై పడి ఆయన ఆర్థికంగా చితికి పోతున్నాడన్నారు. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో కరవు పరిస్థితులు ఉండడం వల్ల యువత పట్టణాలకు వలసవెళ్తున్నారన్నారు. దీంతో వ్యవసాయం కుదేలవుతోందన్నారు. ఈ పరిస్థితి గమనించిన సీఎం చంద్రబాబు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి నడుం బిగించారన్నారు. ఇందులో భాగంగా సహజసిద్ధమైన వ్యవసాయ విధానాన్ని ప్రోత్సహిస్తున్నారన్నారు. రసాయనాలతో పండించే పంట కన్నా సహజసిద్ధంగా చేసే వ్యవసాయం ఎంతో మిన్న అన్నారు.