తెలంగాణ

ముంబయలోని తెలంగాణ బిడ్డలను ఆదుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 22: ముంబాయిలో తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌తో చర్చించి పరిష్కరించేందుకు కృషి చేయాలని సిపిఐ జాతీయ సమితి కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును కోరారు. ఈ మేరకు నారాయణ సోమవారం ముఖ్యమంత్రి కెసిఆర్‌కు లేఖ రాశారు. తమ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఈ నెల 20, 21 తేదీల్లో ముంబాయికి వెళ్ళినప్పుడు అక్కడ నివసిస్తున్న తెలంగాణ ప్రజలు తనను కలిసి అనేక సమస్యలు చెప్పారని ఆయన పేర్కొన్నారు. ముంబాయి, బివాండి తదితర ప్రాంతాల్లో బీడి, చేనేత, భవన నిర్మాణ రంగాల్లో పని చేస్తున్న వారికి లోకల్, నాన్-లోకల్ సమస్య, కుల ధృవీకరణ పత్రాల సమస్య ఎదురవుతున్నదని, విద్యాభ్యాసానికి కూడా సమస్యలు ఎదురవుతున్నాయని ఆయన తెలిపారు. మంగళవారం మహారాష్ట్ర ముఖ్యమంత్రితో చర్చించేందుకు వెళుతున్నందున తెలంగాణ బిడ్డల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సిందిగా నారాయణ సిఎం కెసిఆర్‌ను కోరారు.