తెలంగాణ
గవర్నర్ ప్రసంగంపై ఉభయ సభల్లోనూ తీర్మానం ఆమోదం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 8 March 2020
హైదరాబాద్, మార్చి 7: తెలంగాణ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరాజన్ శుక్రవారం చేసిన ప్రసంగంపై అధికార పార్టీ సభ్యులు శనివారం ధన్యవాదాలు తెలుపుతూ ప్రతిపాదించిన తీర్మానానికి శాసనసభ, శాసనమండలి ఆమోదం తెలిపాయి. గవర్నర్ ప్రసంగంపై శనివారం ఉదయం నుండి సాయంత్రం వరకు చర్చ జరిగింది. ఈ చర్చకు ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా సమాధానం చెప్పారు. సీఎం సమాధానం తర్వాత తీర్మానాన్ని సభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి ఓటింగ్కు పెట్టారు. మూజువాణి ఓటుతో సభ ఈ తీర్మానాన్ని ఆమోదించింది. ఆ తర్వాత శాసనసభ స్పీకర్ పోచారం మాట్లాడుతూ, సభను వాయిదా వేస్తున్నానని, ఆదివారం ఉదయం 11.30 గంటలకు తిరిగి సభ సమావేశమవుతుందని ప్రకటించారు.