తెలంగాణ

సరిలేరు మీకెవ్వరు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మహిళా దినోత్సవం సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టింది. శనివారం సికిందరాబాద్ నుంచి వికారాబాద్ వరకూ పూర్తిస్థాయిలో మహిళా సిబ్బందితో ప్యాసింజర్ రైలును నడిపారు. దక్షిణ మధ్య రైల్వే జోన్‌లో 5 స్టేషన్లల్లో మహిళా ఉద్యోగులు పనిచేస్తున్నారు. తెలంగాణలో బేగంపేట, విద్యానగర్ రైల్వే స్టేషన్లలో మహిళా ఉద్యోగులు విధినిర్వహణ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతి సమీపంలో ఉన్న చంద్రగరి, విజయవాడ వద్ద రామవరప్పాడు, న్యూ గుంటూరు స్టేషన్లలో మహిళా ఉద్యోగులు పనిచేస్తున్నారు. సికిందరాబాద్ నుంచి వికారాబాద్ వరకు మహిళా సిబ్బందే రైలు నడపడాన్ని దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ అభినందించారు. రైలు డ్రైవర్ నుంచి గార్డ్‌తో పాటు రైల్వే స్టేషర్ మాస్టర్ రైల్లో ప్రయాణికుల రక్షణ కోసం మహిళా సిబ్బంది పర్యవేక్షించడం పట్ల రైల్వే ప్రయాణికులు సైతం ప్రశంసించారు.

*చిత్రాలు.. .మహిళా దినోత్సవం సందర్భంగా సికిందరాబాద్ నుంచి వికారాబాద్ వరకు శనివారం ప్యాసింజర్ రైలును నడిపిన రైల్వే మహిళా సిబ్బంది