తెలంగాణ

మల్లన్నసాగర్‌కు లక్ష్మాపూర్ వాసుల అంగీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తొగుట, జూలై 11: మల్లన్నసాగర్ ప్రాజెక్టుకు సమ్మతిస్తు భూములు అప్పగించేందుకు మెదక్ జిల్లా తొగుట మండలం లక్ష్మాపూర్ గ్రామస్థులు అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే రామలింగారెడ్డి సమక్షంలో అంగీకరించారు. సర్పంచ్ పిట్ల శ్రీనివాస్ నేతృత్వంలో గ్రామస్థులు సోమవారం తొగుటకు చేరుకొని ఎమ్మెల్యే రామలింగారెడ్డి సమక్షంలో ప్రాజెక్టుకు గ్రామస్థులు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. సిఎం కెసిఆర్, మంత్రి హరీష్‌రావులపై నమ్మకంతో మీరు ఇచ్చిన హామీమేరకు ప్రాజెక్టుకు అనుకూలంగా మారామన్నారు. నిర్వాసితులకు నష్టం కలిగించకుండా అన్నిరకాలుగా మేలుచేస్తారన్న విశ్వాసంతోనే తాము భూములు అప్పగించేందుకు అంగీకరించినట్లు తెలిపారు. ఇల్లుకు ఇల్లు, భూమికి భూమి, ఊరుకు ఊరు, జీవనోపాధికి అవకాశాలు కల్పించి అన్ని విధాలా మేలు చేకూర్చాలని గ్రామస్థులు ఎమ్మెల్యేను కోరారు.
లక్ష్మాపూర్ ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తా: ఎమ్మెల్యే
టిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మల్లన్నసాగర్ ప్రాజెక్టుకు లక్ష్మాపూర్ గ్రామస్థులు మద్దతిస్తూ అంగీకరించడం శుభపరిణామం అని, వారికి శిరస్సు వంచి నమస్కరిస్తానని అంచనాల కమిటి రాష్ట్ర చైర్మన్, ఎమ్మెల్యే రామలింగారెడ్డి పేర్కొన్నారు. ప్రజల ఆశీస్సులు, దయాదాక్షిణ్యాలతోనే తాను ఎమ్మెల్యేగా గెలిచానని, వారికి నష్టం కలిగించకుండా మేలు చేసేందుకు కృషి చేస్తానన్నారు. లక్ష్మాపూర్ వాసుల త్యాగాలు వృధాకావని, వారిని అన్ని రకాలుగా ఆదుకొని న్యాయమైన పరిహారం ఇప్పిస్తానన్నారు. ప్రభుత్వం నిర్వాసితులకు 80శాతం సబ్సిడీతో ప్రభుత్వ పథకాలు వర్తింపచేసేలా, 200గజాల్లో ఇల్లు కోల్పోతున్న వారికి ఇంటినిర్మాణం చేపట్టి వారికి చేయూతనందిస్తామన్నారు. గ్రామంలో భూవివాదాలు ఉంటే వాటిని పరిష్కరించి ప్రజలకు మేలు చేకూర్చాలని తహశీల్దార్ దేశ్యాను ఆదేశించారు. గ్రామస్థులకు ఇబ్బందులు లేకుండా వారికి మేలైన పరిహారం వచ్చేలా అందరిని కలుపుకొని రిజిస్ట్రేషన్ చేయాలని సూచించారు. 2రోజుల్లో గ్రామంలోని అందరిని కలుపుకొని రిజిస్ట్రేషన్లు ప్రారంభిస్తామని తహశీల్దార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి రేణుక, ఎఎంసి చైర్మన్ కనకయ్య, సొసైటి వైస్ చైర్మన్ మల్లారెడ్డి, సర్పంచులు రాజాగౌడ్, రమేశ్, స్వామి, ఉప సర్పంచు స్వామి, వార్డు సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

చిత్రం.. ఎమ్మెల్యే రామలింగారెడ్డి సమక్షంలో మల్లన్నసాగర్ ప్రాజెక్టుకు మద్దతు తెలుపుతున్న లక్ష్మాపూర్ గ్రామస్థులు