ఆంధ్రప్రదేశ్
సంస్థానాధీశుడు రాజా సోంభూపాల్ దొర మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 19 August 2019
చిన్నచింతకుంట, ఆగస్టు 18: అమరచింత సంస్థానాధీశుడు, ముక్కెర వంశీయుల్లో ఒకరైన మాజీ ఎమ్మెల్యే రాజాసోంభూపాల్దొర (92) ఆదివారం హైదరాబాద్లో కన్నుమూశారు. 1927 మార్చిలో హైదరాబాద్లో జన్మించిన ఆయన 1962లో అమరచింత సంస్థానంలో రాజుగా పట్ట్ట్భాషేకం పొందారు. 1972 నుంచి 78 వరకూ అమరచింత ఎమ్మెల్యేగా ఎకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ తరువాత కాంగ్రెస్పార్టీలో చేరి మూడుసార్లు ఎమ్మెల్యేగా పని చేశారు. కురుమూర్తి దేవస్థానం అభివృద్ధిలో ముక్కుర వంశీయుల్లో ఒకరైన రాజాసోంభూపాల్ దొర ప్రాత కీలకమైనదని చెప్పవచ్చు, ఆయన కొద్దిరోజులుగా ఆనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లో తుది శ్వాస విడిచారు. సోమవారం సొంత గ్రామమైన అమ్మాపూర్లో అంత్యక్రియలు నిర్వహిస్తారని కుటుంబ సభ్యులు తెలిపారు.