తెలంగాణ

తెరాస అధ్యక్షుడిగా ఈటలను నియమించగలరా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 12: తెరాస అధ్యక్షునిగా రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్‌ను నియమించగలరా? అని బిజెపి ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ముఖ్యమంత్రి కెసిఆర్‌ను ప్రశ్నించారు. నల్లగొండ జిల్లా, సూర్యాపేటలో బిజెపి బహిరంగ సభ విజయవంతం కావడంతో తెరాస బెంబేలెత్తుతోందని ఆదివారం ఆయన విలేఖరుల సమావేశంలో అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకూ రూ.1.16 లక్షల కోట్లు కేటాయించిందని, దీనిపై అసెంబ్లీలో లేదా కెసిఆర్ ఫాం హౌస్‌లో బహిరంగ చర్చకు సిద్ధమని చింతల సవాలు విసిరారు. రాష్ట్రంలో కరవు నివారణకు 791 కోట్ల రూపాయలు కేంద్రం విడుదల చేస్తే ఒక్క రైతుకైనా సాయం అందించారా? అని ప్రశ్నించారు. కెసిఆర్ సిఎం అయిన తర్వాత ఫాం హౌస్‌లో ఎన్ని రోజులు ఉన్నారో, సచివాలయానికి ఎన్ని రోజులు వచ్చారో ప్రజలకు తెలియజేసేందుకు శే్వతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనే దమ్ము, ధైర్యం ఎవరికీ లేదని చింతల అన్నారు.