తెలంగాణ

ఇద్దరు యువతుల హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగదేవ్‌పూర్, జూన్ 6: గుర్తు తెలియని ఇద్దరు యువతులు దారుణ హత్యకు గురైన సంఘటన మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండల పరిధిలోని శ్రీ కొండపోచమ్మ ఆలయం వద్ద సోమవారం ఆలస్యంగా వెలుగు చూసింది. ఈసంఘటనకు సంబంధించి ప్రత్యక్ష సాక్షి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తీగుల్‌నర్సాపూర్ గ్రామానికి చెందిన మహ్మద్ గౌస్ అనే మేకల కాపరి సోమవారం మధ్యాహ్నం ఆలయం వెనుక మేకలను మేపుతున్న క్రమంలో అక్కడ ఉన్న దట్టమైన చెట్ల మద్య నుండి దుర్వాసన వస్తున్న క్రమంలో అటు వైపు వెళ్లి చూసినట్లు తెలిపారు.అక్కడికి వెళ్లి చూసే సరికి గుర్తు తెలియని (20) సంవత్సరాల లోపు వయసున్న ఓ మృత దేహం ఓ చెట్టుకు ఉరి వేసుకుని వేళాడుతుండగా మరో మృత దేహం బండరాళ్ల మధ్య పడివున్న దృశ్యాన్ని చూసి భయాందోళనకు గురైన ఆయన సమీపంలో ఉన్న గ్రామస్థులకు తెలిపినట్లు చెప్పారు. అయితే ఆ యువతులు సిరా,పసుపు కలర్ పంజాబీ డ్రెస్సులు ధరించి ఉండగా చెట్లకు వారి చున్నీలతోనె ఉరి వేసుకున్నట్లుగా ఉండగా, కుళ్లిపోయి అస్థిపంజరంగా మారారు. కాగా ఈసంఘటన స్థలాన్ని బట్టి చూస్తే 20 రోజుల క్రితమే కొందరు దుండగులు ఒ పథకం ప్రకారమే దూర ప్రాంతం నుంచి తీసుకువచ్చి ఇక్కడ ఆత్యచారం జరిపిన అనంతరమే హత్య చేసి చెట్లకు ఉరి వేసినట్లుగా సంఘటన స్థలాన్ని బట్టి తెలుస్తోంది. ఈ సమాచారన్ని తెలుసుకున్న సిద్దిపేట డిఎస్పీ శ్రీ్ధర్, గజ్వేల్ సిఐ సతీస్, జగదేవ్‌పూర్ ఎస్‌ఐ వీరన్నలు సంఘటన స్థలానికి చేరుకుని మృత దేహలను గజ్వేల్ మర్చూరీకి తరలించగా, విఆర్‌ఒ తిరుపతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చెసుకోని వారి ఆచూకీ కోసం విచారణ జరుపనుండగా త్వరలోనే కేసు చేదిస్తామని చెప్పారు.