తెలంగాణ

దొంగతనం నెపంతో బాలలపై దాడి నిందితులపై కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగిత్యాల టౌన్, జూన్ 4: ఓ పాత ఇనుప సామాను దుకాణంలో రాగి వైర్ దొంగలించారనే ఆరోపణతో ముగ్గురు బాలలను దుకాణం యజమాని స్తంభానికి కట్టేసి విచక్షణారహితంగా చితికబాదాడు. ఈ సంఘటన సంఘటన కరీంనగర్ జిల్లా జగిత్యాల పట్టణంలోని శనివారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కొత్తబస్టాండ్ ప్రాంతంలో గల ఓ పాత ఇనుప సామాను దుకాణంలో విబుది మారెమ్మ అనే మహిళ పనిచేస్తూ జీవనోపాధి సాగిస్తుంది. శనివారం తల్లితో పాటు కుమారులు శేఖర్ (10), గంగారాం (9) వీరితో పాటు వారి మిత్రుడు అరవింద్ ఆ దుకాణానికి వచ్చారు. అయితే ఆ దుకాణంలో పిల్లలు రాగి వైరు దొంగిలించారని ఆరోపిస్తూ దుకాణ యజమానితో పాటు ఆయన అనుచరులు ఆ బాలలను స్తంభానికి కట్టేసి విచక్షణారహితంగా చితికబాదడంతో వారు గాయాలపాలయ్యారు.
బాధితుల తల్లి మారెమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కరీమ్‌ఖాన్, ఖాదీర్, ఖాజాయొద్దీన్, సయ్యద్ మతి న్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

chitram బాలుణ్ని స్తంభానికి కట్టేసి ఉంచిన దృశ్యం