తెలంగాణ
కేరళ పీఎస్సీ రిక్రూట్మెంట్లో టాపర్గా సెంట్రల్ వర్శిటీ విద్యార్థి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
హైదరాబాద్, జూన్ 2: కేరళ విద్యాశాఖలో లెక్చరర్ల పోస్టుల ఎంపికకు నిర్వహించిన పరీక్షలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో చదువుకున్న విద్యార్థులు ప్రతిభాపాటవాలను ప్రదర్శించారు. ఎకనామిక్స్లో ఎంఎ, పిహెచ్డి చేసిన అంజు సుశాన్ థామస్ ఎంపిక పరీక్షల్లో టాపర్గా నిలిచారు. నాలుగో ర్యాంకులో జానకి ఎస్ఆర్, ఐదో ర్యాంకు సాధించిన గోపిక జిజి, ఏడో ర్యాంకు సాధించిన దీపికా రఘుకుమార్, 22వ ర్యాంకు సాధించిన బషీర్ కెకె, 47వ ర్యాంకు సాధించిన షీజాఎం, 54వ ర్యాంకు సాధించిన ఎం రషీద్లు కూడా సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్ధులేనని రిజిస్ట్రార్ ఎం సుధాకర్ చెప్పారు. కేరళ పబ్లిక్ సర్వీసు కమిషన్ నిర్వహించిన ఈ ఎంపిక పరీక్షలో సెంట్రల్ యూనివర్శిటీలు విద్యార్ధులు ఎంపిక కావడం విశేషమని ఆయన పేర్కొన్నారు.