ఆంధ్రప్రదేశ్‌

శారదాపీఠాన్ని సందర్శించిన ఐవైఆర్ కృష్ణారావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 27: బ్రాహ్మణ కార్పొరేన్‌షన్ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు విశాఖ పర్యటనలో భాగంగా శుక్రవారం శ్రీ శారదాపీఠాన్ని సందర్శించారు. ముందుగా పీఠంలోని దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శారదాపీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీని కలుసుకున్నారు. కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వ పరంగా బ్రాహ్మణుల సంక్షేమం, అభ్యున్నతికి తీసుకుంటున్న చర్యలను వివరించారు.
నిరుపేద బ్రాహ్మణ వర్గాల్లో విద్య, ఉపాధి అవకాశాల మెరుగుకు అమలు చేయనున్న పథకాలు వివరించారు. అలాగే బ్రాహ్మణ వర్గాలకు ఎన్టీఆర్ ఆరోగ్య సేవ ద్వారా వైద్య సేవలందించేందుకు నిర్ణయించామని తెలిపారు. ఈ సందర్భంగా స్వరూపానంద స్వామీజీ పలు సలహాలు, సూచనలు చేయగా, వాటిని అమలు చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం కృష్ణారావు స్వామీజీతో ఏకాంతంగా చర్చించి, ఆయన ఆశీస్సులు తీసుకున్నారు.