తెలంగాణ
గవర్నర్తో బిజెపి నేత లక్ష్మణ్ భేటీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 11 April 2016
హైదరాబాద్: తెలంగాణలో ప్రస్తుతం తీవ్ర కరవు పరిస్థితులు నెలకొన్నందున రైతులను అన్ని విధాలా ఆదుకోవాలని తెలంగాణ అసెంబ్లీలో బిజెపి పక్షం నేత లక్ష్మణ్ రాష్ట్ర గవర్నర్ నరసింహన్కు విజ్ఞప్తి చేశారు. తొమ్మిది జిల్లాల్లో ఇటీవల తమ పార్టీ నాయకులు విస్తృతంగా పర్యటించి దుర్భిక్ష పరిస్థితులపై అధ్యయనం చేశారని ఆయన తెలిపారు. కరవు పరిస్థితులపై పార్టీ తరఫున ఒక నివేదికను రాజ్భవన్లో గవర్నర్కు అందజేశారు. రైతులకు రుణాలు, విత్తనాలు అందజేయాలని, పశుగ్రాస పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.