ఆంధ్రప్రదేశ్‌

తిరుమలలో పెరిగిన రద్దీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, ఫిబ్రవరి 12: వివాహాది శుభకార్యాలకు ఈనెల 14 నుంచి ముహూర్తాలు ఉండటంతో తిరుమల్లో పెద్ద ఎత్తున వివాహాలు జరుగనున్నాయి. ఈక్రమంలో శుక్రవారం తిరుమలకు వచ్చిన భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది. దీంతో వసతి కొరత ఏర్పడింది. గంటల తరబడి వేచివున్నా గదులు దొరక్క పోవడంతో ఇబ్బందులు పడుతున్న భక్తులు ఆగ్రహంతో ఊగిపోయారు. ఈక్రమంలో పద్మావతి అతిథిగృహం ఎంక్వయిరీ వద్ద భక్తులు ఏకమై టిటిడికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమాచారం తెలుసుకున్న ఏవిఎస్‌ఓ కూర్మారావు సంఘటనా స్థలానికి చేరుకుని తిరుమల్లో రద్దీ పరిస్థితిని వివరించి వారిని శాంతపరిచారు.