ఆంధ్రప్రదేశ్‌

ఘోర రోడ్డు ప్రమాదం కారు, ట్రాక్టర్ ఢీ: ఐదుగురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రత్తిపాడు, సెప్టెంబర్ 13: తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడువద్ద జాతీయ రహదారిపై మంగళవారం సాయంత్రం ఆరున్నర గంటలకు ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ట్రాక్టరును వేగంగా వస్తున్న కారు ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన మరో మహిళ పరిస్థితి ఆందోళనకరంగావుంది. జిల్లాలోని అనపర్తికి చెందిన యెలిచర్ల సుదర్శన్‌కుమార్ (60), ఆయన భార్య స్తోత్రకుమారి (55), కోరాటి స్తోత్రపతిరాజు (40), ఆయన భార్య క్రాంతికుమారి (30), కోరాటి రాణి మంగళవారం ఉదయం ప్రార్థనల నిమిత్తం కారులో విశాఖపట్నం వెళ్లారు. ప్రార్థనలు ముగించుకున్న అనంతరం తిరిగి అనపర్తి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న కారు (ఎపి 05 డిసి 7789) ప్రత్తిపాడు వద్ద జాతీయ రహదారిపై యర్రవరం వైపునుండి మెటల్ లోడుతో వస్తున్న ట్రాక్టరును ఎదురుగా ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది. కారులో ప్రయాణిస్తున్న వారిలో రాణి మినహా మిగిలిన నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన రాణిని ప్రత్తిపాడు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి, అక్కడి నుండి కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా మృతదేహాలు కారులోనే చిక్కుకుపోయాయి. పు
chitram...
నుజ్జునుజ్జయిన కారు