తెలంగాణ

తెలంగాణ ప్రైవేటు లిమిటెడ్‌గా మార్చారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 23: ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణను ప్రైవేటు లిమిటెడ్‌గా మారుస్తున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీని ఇప్పటివరకు తెలంగాణకు రావలసిందిగా ముఖ్యమంత్రి ఆహ్వానించలేదని ఆయన బుధవారం విలేఖరుల సమావేశంలో తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర మంత్రి కెటిఆర్ ప్రధానిని విమర్శిస్తున్నారని ఆయన అన్నారు. మంత్రి కెటిఆర్‌కు ప్రధాని మోదీని విమర్శించే స్థాయి లేదని ఆయన తెలిపారు. ఏ హోదాలో రెండు పడకల గదుల ఇళ్ళకు శంకుస్థాపన చేస్తున్నారని ఆయన కెటిఆర్‌ను ప్రశ్నించారు. ఇప్పటి వరకు రెండు పడకల గదుల ఇండ్లు ఎన్ని నిర్మించారని ఆయన ప్రశ్నించారు. ఇండ్ల నిర్మాణానికి నిధులు విడుదల చేయలేదని ఆయన విమర్శించారు.