ఆంధ్రప్రదేశ్‌

తల్లి, ఇద్దరు కూతుళ్లు ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పీలేరు, ఏప్రిల్ 10: చిత్తూరు జిల్లా పీలేరు మండలం మేళ్లచెరువు గ్రామం మిధులానగరానికి చెందిన సునీత తన ఇద్దరు కూతుళ్లతో కలిసి బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ కలహాలే ఆమె ఆత్మహత్యకు కారణమని స్థానికులు అంటున్నారు. మునిశేఖర్ భార్య సునీత (28), యశ్వని (8), నవ్య (6) మేళ్లచెరువు గ్రామం మిధులానగర్‌లో నివాసముంటున్నారు. ఆదివారం సునీత తన ఇద్దరు పిల్లలతో వెళ్లి బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పీలేరు సిఐ నాగరాజు, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని బావిలో పడి మృతి చెందిన వారి మృతదేహాలను వెలికితీసి పీలేరు ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. భర్త మునిశేఖర్ దురలవాట్లకు లోనై ప్రతిరోజూ భార్యను వేధిస్తుండగా జీవితంపై విరక్తి చెంది తల్లీ, కూతుళ్లు ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈ మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పీలేరు సిఐ నాగరాజు తెలిపారు.