తెలంగాణ
శ్రీయ మృతదేహానికి మళ్లీ పోస్టుమార్టం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 12 March 2016
హైదరాబాద్: విశాఖలోని గీతం వర్సిటీలో ఇంజనీరింగ్ చదువుతూ అనుమానాస్పద స్థితిలో మరణించిన హైదరాబాద్ యువతి శ్రీయ మృతదేహానికి శనివారం ఉదయం వైద్యులు రీ పోస్ట్మార్టం జరిపారు. ఆమె విశాఖలో మరణించగా, హైదరాబాద్లోని అమ్ముగూడలో కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. తమ కుమార్తె మరణంపై అనేక అనుమానాలున్నందున రీ పోస్ట్మార్టం జరపాలని శ్రీయ తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు, రెవెన్యూ అధికారుల సమక్షంలో మృతదేహాన్ని బయటకు తీసి రెండోసారి పోస్ట్మార్టం చేశారు.