ఆంధ్రప్రదేశ్‌

అమరావతికి వెళ్లిన సచివాలయ సిబ్బంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: నగరంలోని ఎపి సచివాలయంలో అయిదు శాఖలకు చెందిన ఉద్యోగులు బుధవారం నవ్యాంధ్ర రాజధాని అమరావతికి 5 ప్రత్యేక బస్సుల్లో బయలుదేరారు. కార్మిక, వైద్య-ఆరోగ్యం, పంచాయితీరాజ్, గృహనిర్మాణ శాఖలకు చెందిన ఉద్యోగులు ఇక్కడి నుంచి తరలివెళ్లారు. వెలగపూడి వద్ద నిర్మించిన తాత్కాలిక సచివాలయంలో వీరు రేపటి నుంచి సేవలందిస్తారు. ఆగస్టు నాటికి అన్ని శాఖలతో అమరావతిలో ఎపి సచివాలయం పనిచేయడం ప్రారంభిస్తుందని ఉద్యోగ సంఘాల నాయకులు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యమయ్యేందుకు తమ వంతు కృషి చేస్తామని వారు తెలిపారు.