ఆంధ్రప్రదేశ్
కోస్తా వెంబడి సాగుతున్న ‘రోను’ తుపాను
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 19 May 2016
విశాఖ: బంగాళాఖాతంలో ఏర్పడిన ‘రోను’ తుపాను ప్రస్తుతం కోస్తాంధ్ర తీరం వెంబడి కొనసాగుతోంది. ఫలితంగా ఉభయ గోదావరి, కృష్ణా, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో గురువారం ఉదయం నుంచి భారీవర్షాలు కురుస్తున్నాయి. ముమ్మడివరంలో నాలుగు గంటల వ్యవధిలో సుమారు 5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. తూర్పు గోదావరి జిల్లాకు 5 ఎన్డిఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. కాకినాడ, విశాఖ తదితర జిల్లాల్లో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు. తుపాను ప్రభావంతో కోసాంధ్ర, ఒడిశా, బెంగాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. చేపలవేటకు వెళ్లరాదని మత్స్యకారులను హెచ్చరించారు. కోస్తా జిల్లాల్లో పునరావాస కేంద్రాల ఏర్పాటుకు కలెక్టర్లు సిద్ధంగా ఉండాలని ఎపి ప్రభుత్వం ఆదేశించింది.