తెలంగాణ

కేసిఆర్, ఎర్రబెల్లి రహస్యమిత్రులు-రేవంత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్-టిఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్న ఎర్రెబల్లి దయాకర్ రావు, ముఖ్యమంత్రి కేసిఆర్ చాలాకాలంగా రహస్యమిత్రులను టిడిపి సీనియర్ నేత రేవంత్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో కులసమీకరణలు జరుగుతున్నాయని, అందువల్లే చేరికలు ఉధృతమయ్యాయని ఆయన అన్నారు. టిటిడిపిలో మాదిరిగానే టిఆర్‌ఎస్ పార్టీలోను, ఆయన కుటుంబంలోనూ మార్పులుంటాయని అన్నారు. ఎర్రబెల్లికి టిఆర్‌ఎస్‌లో గౌరవమర్యాదలేమీ దక్కవని, అక్కడ ఆయనని బానిసగానే చూస్తారని ఆయన అన్నారు. మనసుమార్చుకుని ఆయన సొంతపార్టీలలోకి రావాలని సూచించారు. గతంలో ఒకసారి ఎర్రబెల్లిని పార్టీ క్షమించిన విషయాన్ని గుర్తుచేసిన రేవంత్ దయాకర్ రావు తీరులో మార్పురాలేదని అన్నారు.