తెలంగాణ

ఓయును పట్టించుకోని కెసిఆర్: రేవంత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతగానో ఉద్యమించిన ఉస్మానియా విశ్వవిద్యాలయంపై కెసిఆర్ సర్కారు చిన్నచూపు చూస్తోందని టి.టిడిపి నేత రేవంత్ రెడ్డి ఆరోపించారు. పోరాటం చేసిన విద్యార్థులకు నేడు ఎలాంటి గుర్తింపు, గౌరవం లేకుండా పోయాయన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలను ట్యాంక్‌బండ్‌కు బదులు ఓయులో జరపాలన్నారు. తెలంగాణ కోసం త్యాగాలు చేసిన అమరుల కుటుంబాలను ఆదుకుంటామని కెసిఆర్ ఇచ్చిన హామీలు గాలిలో కలిసిపోయాయన్నారు. జూన్ 2న తాము నిర్వహించే జనజాతరలో పాల్గొనాల్సిందిగా ఓయు విద్యార్థులు ఆహ్వానించిన సందర్నంగా రేవంత్ మాట్లాడారు.