తెలంగాణ
ఉపఎన్నిక ముసుగులో తెరాస భారీ వసూళ్లు !
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 12 May 2016
ఖమ్మం: పాలేరు ఉపఎన్నికను సాకుగా చూపించి తెరాస మంత్రులు, నాయకులు కోట్లాది రూపాయల మేరకు వసూళ్లు చేస్తున్నట్లు టి.టిడిపి నాయకుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆయన గురువారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, కాంట్రాక్టర్ల నుంచి కోట్లలో డబ్బు వసూలు చేస్తున్న తెరాస నాయకులను ప్రజలే నిలదీయాలన్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన కాంట్రాక్టర్లకు ఇరిగేషన్ ప్రాజెక్టులను అప్పగించి ముడుపులు దండుకుంటున్నారని ఆరోపించారు. పాలేరులో తెరాస అభ్యర్థిగా పోటీ చేస్తున్న తుమ్మల నాగేశ్వర రావు మంత్రి పదవిలో ఉంటూ అధికార దుర్వినియోగానికి, అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు.