ఆంధ్రప్రదేశ్
రక్తపరీక్షలకు ముద్రగడ నిరాకరణ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 15 June 2016
రాజమండ్రి: ఇక్కడి ప్రభుత్వ ఆస్పత్రిలో కాపు ఉద్యమనాయకుడు ముద్రగడ పద్మనాభం చేస్తున్న ఆమరణ దీక్ష బుధవారం ఏడో రోజుకు చేరింది. రక్తపరీక్షలు చేయించుకునేందుకు ఆయన నిరాకరిస్తున్నట్లు, అయితే రెండు గంటలకోసారి బీపీ పరీక్ష చేయించుకుంటున్నారని వైద్యులు తెలిపారు. కుటుంబ సభ్యుల సహాయంతో ఆయనకు ఈరోజు సాయంత్రంలోగా వైద్యచికిత్స అందిస్తామని డాక్టర్లు తెలిపారు. ముద్రగడ భార్య, కోడలికి మాత్రం వైద్య చికిత్స అందిస్తున్నారు. ముద్రగడ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఎప్పటికప్పుడు సమాచారాన్ని జిల్లా యంత్రాంగానికి తెలియజేస్తున్నారు.