ఆంధ్రప్రదేశ్‌

రైల్వేమంత్రి విశాఖ పర్యటన రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ: కేంద్ర రైల్వేశాఖా మంత్రి సురేష్ ప్రభు మంగళవారం విశాఖలో జరుపతలపెట్టిన పర్యటన చివరి నిమిషంలో వాయిదా పడింది. నవ్యాంధ్ర రాజధాని అమరావతికి ప్రత్యేక ఇంటర్ సిటీ రైలును ప్రారంభించేందుకు విజయవాడ వచ్చిన ఆయన విశాఖలోనూ పర్యటిస్తారని తొలుత అధికారులు ప్రకటించారు. ఇక్కడికి వస్తే రైల్వేజోన్ గురించి ప్రకటన చేయాల్సి వస్తుందన్న కారణంగానే సురేష్ ప్రభు వాయిదా పడిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. మంగళవారం విజయవాడలో యోగా దినోత్సవం కార్యక్రమంలో ఆయన సిఎం చంద్రబాబుతో పాటు పాల్గొంటారు.