Others

ప్రకృతిసేవ పరమాత్ముని పూజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎల్లపుడును వేదాలల్లో మాత్రమే వినబడు నీవు పశువులను మేపుకొని జీవించవలసిన గొల్లజాతికి వచ్చి మాసేవను స్వీకరించడానికి వచ్చావుకదా. మా చేత అంతరంగిక కైంకర్యాలను స్వీకరించి తీరవలెను. శబ్దాది విషయము శరీరమును నిలబెట్టు సాధనములుగా గలిగియున్న మాకు నీ దివ్యమంగళ విగ్రహసౌందర్యాన్ని చూసి, తిను అన్నం, తాగు నీరు. నములు తాంబూలము అన్నియూ ఆశ్రీత సులభుడవైన నీవేస్వామి అనునట్లు చేసి మా స్వరూపానుగుణమగు కైంకర్యమును నొసంగకుండుట నీకు తగదు.
నీ నుండి పరను పుచ్చుకునుటకు వచ్చినవారం. ఏడేడు జన్మలకును నీతోవిడరాని బంధుత్వం కలవారము, నీకు మాత్రమే సేవలు చేయువారం, మాకు ఇతరములైన కోరికలేమియు లేకుండునట్లు అనుగ్రహించుము.
మార్గశీర్షమాసంలో గోపికలు తమ పెద్దల అనుమతితో వర్షానికై చేసిన వ్రతమే ఈ ధనుర్మాస వ్రతం. పెద్దల తృప్తికొరకు తాము స్నానవ్రతము ఆచరింతుము. ఈవ్రతాచరణకు పర వాయిద్యం కావాలి దాన్ని కోరడానికి మీ సన్నిధి చేరి ఉన్నామని కృష్ణునికి మొరపెట్టుకుంటున్నారు.
ఈవ్రతము భగవంతుని చేరవలయునని కోరువారందరూ చేయదగిన వ్రతమే శ్రీవ్రతం. వ్రతాన్ని ఆచరించడానికి ముందుగా భగవంతునితో మంచి సంబంధబాంధవ్యాలను ఏర్పర్చుకోవాలి. ఆ తరువాత శమదమాది ఆత్మగుణోపేతులై ఆచార్య సమాశ్రయణమును గావించాలి.
తరువాత మంత్రోపదేశం నొంది మంత్రార్థమును తెలియవలెను. ఉపాయము భగవంతుడైనను జీవులు సర్వేశ్వరు నాశ్రయించునపుడు ఇద్దరినీ కలిపెడి అమ్మవారిని ఆశ్రయించవలెను. ఆమె ద్వారా స్వామియే ఉపాయమని నిశ్చయించుకొని స్వామి కటాక్ష పాత్రులు కావలెను.తరువాత స్వామిని దర్శించి మంగళాశాసనము గావించి భగవత్కటాక్షముతో స్వరూప జ్ఞానాదులను ఆపేక్షించి ముక్తులమై బ్రహ్మాలంకారాద్యలంకృతులమై నిన్ను చేరి సాయుజ్యం నొందవలెనని ప్రార్థించాలి. ఇదియే సంసారం నుండి విడివడి భగవానుని చేరి భవగదనుభవం వరకు చేయవలసిన ప్రక్రియ . ఈ ప్రక్రియే ఈపాశురాలల్లో తెలిపి ఉన్నారు.
ముఖ్యంగా రెండు విషయములను 28,29 పాశురాలల్లో వివరించి వ్రతమును ముగించుచున్నారు. 30 పాశురమున ఫలమును వివరించారు. శ్రీకృష్ణుడే ఉపాయం అని దృఢంగా చెప్పితమకు తాముగా ఆర్జించుకొనిన జ్ఞానం సత్కర్మాచరణము లేదని నిర్హేతుక కృపతోతమ కులమున పుట్టిన శ్రీకృష్ణుడే తమ పుణ్యమని అతనికి తమకు విడదీయరాని సంబంధం కలదని మేము అతని వారమని తమను స్వామి అయిన అతనే కాపాడి పురుషార్థమును ప్రసాదించగలడని గోపికలు దృఢంగా నమ్మారు.
అనన్య భోగ్యత్వం, అనన్యోపాయత్వం, అనన్యార్హత్వం ఈ మూడు జీవుని స్వరూపాలు. భగవానుడే తప్ప ఇతర విషయములను అనుభవింపవలెనని కోరిక లేకుండుట.్భగవానుని తప్ప మరేమీకోరకుండుట. ఈ లక్షణాలే భగవత్ప్రాప్త్తికి అర్హులు.‘గోవిందా! నీకు’ అనుమాటతోసర్వజగత్కారణం సర్వజగద్రక్షకుడగు పరమాత్మకే అని అకారార్థం చెప్పబడింది. నీకే అని ఏకారంలో ఓం లోని ఉకారార్థం సూచించబడింది. మకారార్థం జీవసముదాయం తెలుపబడింది. ఇట్లే ప్రణవార్థం వివరించబడింది. మూలమంత్ర పరమార్థమే ఈ సిరినోము తిరుపాపవై ఉద్దేశం.

- ఆర్ లక్ష్మణమూర్తి , 7207074899