ఆంధ్రప్రదేశ్‌

హోదాపై త్వరలోనే స్పష్టత: వెంకయ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: ఎపికి ప్రత్యేకహోదాపై త్వరలోనే స్పష్టత వస్తుందని, ఈ విషయమై ఇప్పటికే ఆర్థికమంత్రి జైట్లీ, నీతిఆయోగ్ దృష్టిసారించినట్టు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు శనివారం ఇక్కడ మీడియాకు తెలిపారు. హోదా విషయమై కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి అనుసరిస్తోందన్నారు. ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వరాదని గతంలో కాంగ్రెస్ ఎంపీ వీరప్పమొయిలీ అన్నారని, అలా ఇస్తే పెట్టుబడులన్నీ ఇతర రాష్ట్రాల నుంచి ఎపికి తరలిపోతాయని అన్నారని వెంకయ్య చెప్పారు. కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఉంటే హోదా గురించి విభజన చట్టంలో ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు.