ఆంధ్రప్రదేశ్‌

క్షీణించిన ముద్రగడ ఆరోగ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ: తుని విధ్వంసకాండకు సంబంధించి అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని కోరుతూ కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం చేస్తున్న ఆమరణ దీక్ష మంగళవారం ఆరోరోజుకు చేరింది. రాజమండ్రి ఆస్పత్రిలో పోలీసులు చేర్పించినప్పటికీ ఆయన దీక్ష కొనసాగిస్తూ వైద్యాన్ని నిరాకరిస్తున్నారు. ఆయన ఆరోగ్యం క్షీణించిందని రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. బలవంతంగానైనా ఆయనకు వైద్యాన్ని అందించేందుకు తాము సిద్ధమేనని వారు చెప్పారు. నిరాహార దీక్షలో ఉన్న ముద్రగడ భార్య, కోడలికి వారి అనుమతితో వైద్యం అందిస్తున్నారు. ముద్రగడ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని ఆరోగ్యమంత్రి కామినేని శ్రీనివాస్‌కు, ఆ శాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్యకు, జిల్లా కలెక్టర్‌కు నివేదిస్తున్నారు.