ఆంధ్రప్రదేశ్‌

ఇంట్లోనే నిరాహార దీక్ష చేస్తా: ముద్రగడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కిర్లంపూడి: కాపులకు రిజర్వేషన్ల కోసం తాము నాలుగు రోజుల తర్వాత కిర్లంపూడిలోని తన ఇంట్లోనే ఆమరణ దీక్ష ప్రారంభిస్తానని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సోమవారం ప్రకటించారు. భార్యతో కలిసి దీక్ష మొదలు పెడతానని, ఆందోళనకారులు ఎవరికివారు తమ ఇళ్లలో దీక్షలు చేయాలన్నారు. అందరూ కిర్లంపూడికి రావాల్సిన అవసరం లేదని, శాంతియుతంగానే ఉద్యమం కొనసాగించాలన్నారు. కాపు గర్జన సందర్భంగా తునిలో హింసాకాండకు అధికార తెలుగుదేశం పార్టీ కుట్ర పన్నిందని ఆరోపించారు. గర్జన సందర్భంగా కాపులకు బస్సులు, వసతి సౌకర్యాలు కల్పించలేదని అన్నారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా కాపులు భారీ సంఖ్యలో తరలివచ్చి గర్జనను విజయవంతం చేశారన్నారు. హింసాత్మక సంఘటనలతో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు.