ఆంధ్రప్రదేశ్‌

మహానాడులో 28 తీర్మానాలకు ఆమోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి:రాయలసీమను రతనాల సీమగా మారుస్తామని, అందుకోసం తెలుగుదేశం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు. తిరుపతిలో మహానాడు మూడోరోజు కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఇప్పటివరకు 28 తీర్మానాలకు ఆమోదం లభించిందని, వెయ్యిమంది వలంటీర్లు, కార్యకర్తలు అహర్నిశలు కష్టపడి మహానాడును దిగ్విజయం చేస్తున్నారని ఆయన ప్రశంసించారు. తెలుగుదేశం పార్టీ మొదటి మహానాడు, ఇప్పటి మహానాడు తిరుపతిలోనే నిర్వహించుకోవడం గర్వకారణమని అన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలను ఆదుకునేందుకు చేపట్టిన పథకాలగురించి ఆయన వివరించారు. మున్ముందు చేపట్టబోయే కార్యక్రమాలను వివరించారు. మహానాడులో ఇప్పటివరకు 11.55 కోట్ల విరాళాలు వచ్చాయని ఆయన వివరించారు.