ఆంధ్రప్రదేశ్
తిరుపతిలో మహానాడు సంరంభం ప్రారంభం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 27 May 2016
తిరుపతి: మూడు రోజులపాటు జరిగే తెలుగుదేశం పార్టీ మహానాడు ఉత్సవాలు శుక్రవారం తిరుపతిలో ఘనంగా ప్రారంభమయ్యాయి. టిడిపి అధ్యక్షుడు, ఎపి సిఎం చంద్రబాబు పార్టీ పతాకాన్ని ఎగురవేశారు. దివంగత నేత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. త్రీడీ షో, ఫొటో ఎగ్జిబిషన్లను ఆయన ప్రారంభించారు. కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహూతులను అలరించాయి. మహానాడు సందర్భంగా చంద్రబాబు పార్టీ సభ్యత్వాన్ని నమోదు చేసుకున్నారు. ఎపి టిడిపి అధ్యక్షుడు కళా వెంకట్రావు, సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యనేతలు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన ప్రతినిధులు హాజరయ్యారు.