ఆంధ్రప్రదేశ్‌

రావెల సుశీల్‌పై కేసు కొట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఎపి మంత్రి రావెల కిశోర్‌బాబు తనయుడు సుశీల్‌పై దాఖలైన కేసును ఉమ్మడి హైకోర్టు సోమవారం కొట్టివేసింది. కారులో వెళుతూ ఓ వివాహితను వేధింపులకు గురిచేసినట్లు సుశీల్‌పై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. సుశీల్ తరఫు న్యాయవాది కోర్టులో క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు విచారించి కేసును కొట్టివేసింది. సుశీల్ గానీ, ఆయన కారు డ్రైవర్ గానీ ఎవరో తనకు తెలియదని, పోలీసులే తన చేత బలవంతంగా కేసు పెట్టించారని బాధితురాలు కోర్టు దృష్టికి తెచ్చింది. కేసును వెనక్కితీసుకునేందుకు ఆమె అంగీకరించడంతో సుశీల్‌పై అభియోగాలు రుజువు కానందున కేసును కొట్టివేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది.