ఆంధ్రప్రదేశ్‌

రుణమాఫీ ఫైలుపై చంద్రబాబు సంతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: రాష్ట్రంలో రైతులకు రెండో విడత రుణమాఫీ కింద 3,250 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ ఎపి సిఎం చంద్రబాబు సోమవారం ఉదయం సంతకం చేశారు. వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం ప్రారంభం సందర్భంగా రుణమాఫీ ఫైలుపై ఆయన సంతకం చేసి, రాజధాని నిర్మాణానికి తనపై ఎంతో నమ్మకం ఉంచి రైతులు భూములు ఇచ్చారని కొనియాడారు. ప్రజలందరి ఆకాంక్షలకు తగ్గట్టుగా రాజధానిని నిర్మిస్తామని, అయితే కొందరు వ్యక్తులు రాజకీయ కోణంలో వివాదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. అభివృద్ధిని అడ్డుకునే వారిని ప్రజలే తరిమికొడతారన్నారు.