ఆంధ్రప్రదేశ్
కిడ్నాప్ అయిన బాలుడు శవమై తేలాడు..
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 18 April 2016
గుంటూరు: తల్లిదండ్రులు రెండు లక్షల రూపాయలు చెల్లించినప్పటికీ కనికరించని కిడ్నాపర్లు బాలుడ్ని హత్య చేసిన ఘటన గుంటూరు జిల్లా ఏటి అగ్రహారంలో జరిగింది. ఈనెల 14న ఆదిత్యరాజ్ అనే బాలుడిని కిడ్నాప్ చేసిన ఆగంతుకులు 15 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతడబ్బు ఇచ్చుకోలేని బాలుడి తల్లిదండ్రులు రెండు లక్షలను కిడ్నాపర్లకు చెల్లించారు. తమ కుమారుడి రాక కోసం నిరీక్షిస్తున్న తల్లిదండ్రులకు చివరికి విషాదం మిగిలింది. ఫిరంగిపురం మండలం తాళ్లూరు చెరువులో సోమవారం ఉదయం బాలుడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.