తెలంగాణ
వరకట్న వేధింపులతో గృహిణి ఆత్మహత్య
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 24 December 2015
హైదరాబాద్: అదనపు కట్నం కోసం భర్త వేధించడంతో మనస్తాపం చెందిన లక్ష్మి అనే గృహిణి గురువారం తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. నగరంలోని బేగంపేట ప్రకాష్నగర్లో ఈ ఘటన జరిగింది. రెండేళ్ల క్రితం లక్ష్మికి విదేశ్ అనే వ్యక్తితో పెళ్లి చేసినపుడు భారీగానే కట్నకానుకలు చెల్లించారు. అయితే, మరో 15 లక్షల రూపాయలు తీసుకురావాలంటూ విదేశ్ నుంచి ఆమెకు ఇటీవల వేధింపులు అధికమయ్యాయి. దీంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. లక్ష్మి బంధువుల ఫిర్యాదు మేరకు ఆమె భర్త, అత్తింటివారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.