తెలంగాణ

అభివృద్ధి ముసుగులో అనైతిక ఫిరాయింపులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణలో ప్రస్తుతం అభివృద్ధి ముసుగులో అనైతిక ఫిరాయింపులు జరుగుతున్నాయని సిఎల్‌పి నేత జానారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, వ్యక్తిగత స్వార్థంతోనే కొందరు కాంగ్రెస్ నేతలు తెరాసలోకి వలసపోతున్నారని, అభివృద్ధిని ఆశించే పార్టీ మారుతున్నామని చెప్పడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర విభజన కోసం రెండేళ్ల క్రితం సోనియా గాంధీ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని, ఎలాంటి కృతజ్ఞత లేని తెరాస నేతలు నేడు నీచమైన రాజకీయాలు చేస్తున్నారన్నారు. అనైతిక ఫిరాయింపులకు నిరసనగా తాను పదవికి రాజీనామా చేస్తానని, పార్టీ హైకమాండ్‌తో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటానని జానా తెలిపారు.