ఆంధ్రప్రదేశ్‌

బెయిల్‌పై తిరిగేవారు నేతలవుతారా?: అశోక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: అక్రమ ఆస్తుల కేసుల్లో ఇరుక్కుని బెయిల్‌పై బయట తిరిగేవారు ఎన్నటికీ నేతలు కాలేరని కేంద్రమంత్రి అశోకగజపతి రాజు వ్యాఖ్యానించారు. పరోక్షంగా వైకాపా అధినేత జగన్‌ను ఉద్దేశించి ఆయన ఈ మాటలన్నారు. ఇక్కడ బుధవారం జరిగిన టిడిపి సమావేశంలో అశోక్ మాట్లాడుతూ, అన్ని వర్గాల ప్రజలను నిర్లక్ష్యం చేసిన పార్టీ (కాంగ్రెస్) ఇపుడు ఎక్కడా కనిపించకుండా పోయిందన్నారు. నియోజకవర్గం అభివృద్ధిని ఆకాంక్షిస్తూ బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణ టిడిపిలో చేరడం అభినందనీయమన్నారు. తెలుగుజాతి ఉన్నన్నాళ్లూ తెలుగుదేశం పార్టీకి ఎదురు ఉండదన్నారు.