తెలంగాణ

విద్యార్థుల బస్సు యాత్ర ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: దళిత విద్యార్థి రోహిత్ ఆత్మహత్య కేసులో నిందితులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ హెచ్‌సియు విద్యార్థులు గురువారం ఉదయం బస్సు యాత్ర ప్రారంభించారు. ఆంధ్ర, తెలంగాణల్లోని విద్యార్థులను కలుసుకునేందుకు వీరు రెండు బస్సుల్లో బయల్దేరారు. బస్సు యాత్ర ప్రారంభించిన సందర్భంగా ప్రొఫెసర్ కంచె ఐలయ్య, రిటైర్డ్ ఐఎఎస్ అధికారి కాకి మాధవరావు, రిటైర్డ్ జడ్జి చంద్రకుమార్ తదితరులు హాజరయ్యారు. ఈ నెల 17 వరకు రెండు రాష్ట్రాల్లో బస్సు యాత్ర నిర్వహించి ఆ తర్వాత హైదరాబాద్‌లో భారీ బహిరంగసభ నిర్వహించేందుకు విద్యార్థులు సన్నాహాలు చేస్తున్నారు.