ఆంధ్రప్రదేశ్
అనంతపురంలో డెంగ్యూ : ఇద్దరు చిన్నారుల మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 16 September 2016
అనంతపురం: అనంతపురం వినాయక్ నగర్ కాలనీలో సికెందర్ దంపతుల కుమారులు మహమ్మద్ ఇదురీష్, మహమ్మద్ జునేద్ డెంగ్యూ జ్వరంతో గురువారం రాత్రి మృతి చెందారు. ఆదివారం ఇద్దరు పిల్లలకు ఒకేసారి జ్వరం రావడంతో డెంగ్యూ జ్వరంగా వైద్యులు నిర్దారించారు. అప్పటికే పరిస్థితి విషమించడం, ఇద్దరు చిన్నారులకు ఫిట్స్ కూడా రావడంతో బెంగ ళూరు ఆసుపత్రికి తరలించాలని అనంతపురం వైద్యులు సిఫార్సు చేశారు. అదే రోజు బెంగళూరులోని కార్పోరేట్ ఆసుపత్రికి తీసుకెళ్లి ఆరు లక్షల రూపాయలు వ్యయం చేసి వైద్యం చేయించినా ఫలితం లేకుండా పోయింది. దోమల నిర్మూలన చర్యలే లేవని వినాయక్ నగర్ కాలనీ వాసులు నగరపాలక సంస్థ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.