తెలంగాణ
దేశ ప్రతిష్టను పెంచిన ఇద్దరమ్మాయిలు: దత్తాత్రేయ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 22 August 2016
హైదరాబాద్: రియో ఒలింపిక్స్లో పతకాలను సాధించడం ద్వారా పివి సింధు, సాక్షి మాలిక్ భారత దేశ ప్రతిష్టను కాపాడారని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ఒలింపిక్ పతక విజేత సింధు గౌరవార్థం సోమవారం గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన సత్కార సభలో ఆయన మాట్లాడుతూ, బంగారు పతకాన్ని సాధించలేక పోయినా సింధు మన బంగారం అని ప్రశంసించారు. ఆమె ఆటను దేశ ప్రజానీకం ఎంతో ఉత్కంఠతో వీక్షించిందని ఆయన గుర్తు చేశారు. వచ్చే ఒలింపిక్స్లో సింధు బంగారు పతకాన్ని తెచ్చిపెడుతుందన్నారు.