తెలంగాణ

దాహార్తితో ఇద్దరు చిన్నారుల మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్: వడదెబ్బకు గురై, తాగేందుకు మంచినీళ్లు దొరక్క ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన విషాదకర సంఘటన ఆదిలాబాద్ జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. చెన్నూరు మండలం ముద్దారం అటవీ ప్రాంతంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. లింగంపల్లి నుంచి ఓ తల్లి తన ఇద్దరు కుమారులతో కలిసి ఓ పెళ్లికి హాజరయ్యేందుకు అటవీప్రాంతం గుండా నడిచి వెళ్తుండగా దాహార్తి సమస్య వీరిని వెంటాడింది. పిల్లలకు నీళ్లు తెచ్చేందుకు తల్లి వెళ్లగా పిల్లలు మధు (12), అశోక్ (6) మరణించారు. కొంతదూరంలో తల్లి కూడా వడదెబ్బకు లోనై స్పృహ తప్పి పడిపోయింది. సమీపంలోని గొర్రెల కాపరులు పిల్లల మృతదేహాలను చూడడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.