ఆంధ్రప్రదేశ్‌

ఇడుపులపాయలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హాజరైన జగన్, కుటుంబ సభ్యులు
కడప, డిసెంబర్ 24: కడపజిల్లా ఇడుపులపాయలో వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత, పులివెందుల శాసన సభ్యులు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, కుటుంబ సభ్యులు క్రిస్మస్ పండుగను గురువారం ఘనంగా జరుపుకున్నారు. క్రిస్మస్ పండుగ ముందురోజున ఇడుపులపాయలో వైఎస్ కుటుంబీకులు పండుగ జరుపుకోవడం ఆనవాయితీ. ఇందులో భాగంగా రాష్ట్ర నలుమూలల నుంచి వైఎస్ సమీప బంధువులు ఇడుపులపాయకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఇడుపులపాయలో ఉన్న దివంగత నేత డాక్టర్ వైఎస్సార్ ఘాట్ వద్ద వైఎస్ జగన్, ఆయన కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులర్పించారు. ఇడుపులపాయలో నెమళ్లపార్కు సమీపంలో ఉన్న ప్రత్యేక చర్చిలో వైఎస్ కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రార్థనల అనంతరం జగన్, కుటుంబ సభ్యులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో కలిసి విందు ఆరగించారు. అనంతరం వారు పులివెందులకు బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, కడప ఎంపి వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్సార్‌పార్టీ నాయకురాలు వైఎస్ షర్మిల, వైఎస్సార్ కోడలు భారతి, అల్లుడు అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.