ఆంధ్రప్రదేశ్‌

చైనా నిర్మాణాలకు సర్కారు ప్రాధాన్యత?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, డిసెంబర్ 26: రాజధాని అమరావతిలో జూన్ నాటికి 6 లక్షల చదరపు అడుగుల భవన నిర్మాణం పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ప్రకటించడం గమనిస్తే చైనా నిర్మాణాలను చేపట్టనున్నట్లు స్పష్టమవుతుంది. ఇటీవల మంగళగిరిలో ఎయిమ్స్ నిర్మాణాలకు శంకుస్థాపన చేసిన సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చైనా దేశం చేపట్టే భవన నిర్మాణాల గురించి ప్రస్తావించారు. అంతేకాకుండా చైనా పర్యటన అనంతరం భవన నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేసేందుకు చైనా దేశం చేపడుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలనే ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నారు. ప్రస్తుతం రాజధాని అమరావతిలో ఆర్నెళ్ల కాలంలో 6లక్షల చదరపు అడుగుల్లో పరిపాలనకు సంబంధించిన భవన నిర్మాణాలను పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించడంతో చైనా సాంకేతిక పరిజ్ఞానాన్ని, భవన నిర్మాణాలకు వినియోగిస్తారనే విషయం స్పష్టమవుతోంది.