ఆంధ్రప్రదేశ్‌

అగ్ని ప్రమాదంలో 17 ఇళ్లు భస్మీపటలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూచిపూడి, డిసెంబర్ 26: కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం గోపాలకృష్ణాపురంలో శనివారం తెల్లవారుఝామున విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిన అగ్ని ప్రమాదంలో 17 ఇళ్లు దగ్ధమయ్యాయి. రూ.20లక్షల విలువైన ఆస్తి నష్టం జరిగింది. 17 కుటుంబాల వారు కట్టుబట్టలతో మిగిలారు. ఈ ప్రమాదంలో ఒక దూడ మృతిచెందగా, మూడు పాడిపశువులు తీవ్రంగా గాయపడ్డాయి. సమాచారం తెలుసుకున్న ఇన్‌చార్జ్ తహశీల్దార్, ట్రైనీ కలెక్టర్ సలోని సిరాన్, పామర్రు శాసనసభ్యురాలు ఉప్పులేటి కల్పన, ప్రజాప్రతినిధులు, అధికారులు అగ్ని ప్రమాద ప్రాంతాన్ని సందర్శించారు. బాధిత కుటుంబాలను పరామర్శించారు.