ఆంధ్రప్రదేశ్
కష్టాలున్నా రెవెన్యూ శాతం పెరిగింది: బాబు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 25 May 2016
విజయవాడ: గత రెండేళ్ల కాలంలో ఎన్నో ఆర్థిక సమస్యలు ఎదురైనా నవ్యాంధ్రలో రెవెన్యూ శాతాన్ని పెంచుకోగలిగామని సిఎం చంద్రబాబు అన్నారు. ఇక్కడ బుధవారం ప్రారంభమైన కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ, అభివృద్ధి విషయంలో జిల్లాల మధ్య పోటీతత్వం పెరగాలన్నారు. నవ్యాంధ రెండేళ్ల పాపలాంటిదని ఆయన అభివర్ణించారు. లక్ష్యసాధనకు కలెక్టర్లతో పాటు అన్ని స్థాయిల్లో అధికారులంతా అంకిత భావంతో పనిచేయాలన్నారు. రాష్ట్ర విభజన వల్ల అనేక సమస్యలు ఎదురైనప్పటికీ ఎపిని నెంబర్ వన్గా తీర్చిదిద్దడమే తన ధ్యేయమన్నారు. నీటి వనరులను పరిరక్షించుకుంటే వ్యవసాయ రంగంలో పురోగతి ఉంటుందన్నారు.