ఆంధ్రప్రదేశ్
సైనిక కుటుంబాలకు చంద్రబాబు పరామర్శ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 23 July 2016
విశాఖ: తమిళనాడులో అదృశ్యమైన వైమానికదళ విమానంలో ప్రయాణిస్తూ ఆచూకీ లేకుండా పోయిన విశాఖ వాసుల కుటుంబాలను ఎపి సిఎం చంద్రబాబు శనివారం ఇక్కడ పరామర్శించారు. అదృశ్యమైన విమానంలో విశాఖ ప్రాంతానికి చెందినవారు 8 మంది ఉన్నారు. బాజీ జంక్షన్, బుచ్చిరాజుపాలెంలోని ఎన్ఏడీ ఉద్యోగుల కుటుంబాలను పరామర్శించి బాధితులకు ధైర్యం చెప్పారు. చిన్నారావు, నాగేందర్రావు కుటుంబసభ్యులను ముఖ్యమంత్రి పరామర్శించారు. విమానం ఆచూకీ లభ్యమయ్యే వరకు గాలింపు చర్యలు కొనసాగుతాయన్నారు. సైనిక కుటుంబాలకు అండగా ఉంటామని సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు.