ఆంధ్రప్రదేశ్‌

పాడేరు ఎఎస్పీ శశికుమార్ ఆత్మహత్య !

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ: పాడేరులో ఎఎస్పీగా పనిచేస్తున్న శశికుమార్ (30) గురువారం ఉదయం తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన బంగ్లా నుంచి తుపాకీ పేలిన శబ్దం రావడంతో తొలుత ‘మిస్‌ఫైర్’ అయిందని స్థానిక పోలీసు సిబ్బంది భావించారు. అయితే, శశికుమార్ నుదుటి మీద బుల్లెట్ గాయం కావడం, మృతదేహం సమీపంలో సూసైడ్ నోట్ లభించడంతో ఇది ఆత్మహత్యేనన్న నిర్ధారణకు పోలీసు అధికారులు వచ్చారు. 2012 బ్యాచ్‌కు చెందిన ఆయన గతంలో కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఎఎస్‌పిగా పనిచేశారు. తమిళనాడులోని సేలం జిల్లాకు చెందిన ఈ యువ ఐపిఎస్ అధికారి ఆరునెలల క్రితం పాడేరులో ఎఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. ఈ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలపై ఆయన దృష్టి పెట్టి మంచి అధికారిగా పేరు తెచ్చుకున్నారు. వృత్తిపరంగా వైఫల్యాలు ఎదుర్కొనడంతో తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆయన సూసైడ్ నోట్‌లో రాశారని తెలిసింది. రాళ్లగడ్డ ఎన్‌కౌంటర్ అనంతరం ఆయన ముభావంగా ఉంటున్నారని, ఓ సీనియర్ పోలీసు అధికారితో విభేదాలున్నాయని కూడా తెలుస్తోంది.