ఆంధ్రప్రదేశ్‌

ఢిల్లీ వెళ్లిన స్పీకర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్,జూన్ 28: ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ యూనివర్శిటీని వెంటనే మంజూరు చేయాలని కోరేందుకు శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు ఢిల్లీ వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర మానవ వనరుల మంత్రి స్మృతీ ఇరానితో కలిసి కేంద్రీయ యూనివర్శిటీ అంశాన్ని చర్చిస్తారు. అలాగే తన నియోజకవర్గంలో ఇందుకు స్థలం కూడా ఇచ్చేందుకు సిద్ధం చేశామని ఆయన మంత్రి దృష్టికి తీసుకురానున్నారు. బుధవారం నాడు స్పీకర్ పలువురు కేంద్ర మంత్రులను కూడా కలుస్తారు. కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖా మంత్రి మషేష్‌శర్మను కూడా కలుస్తారు. ఠాగూర్ కల్చరల్ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేయాలని ఆయన కోరుతారు. ఆంధ్రప్రదేశ్ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న రైల్వే మంత్రి సురేష్ ప్రభును కలిసి మద్దిపాడు- సత్తెనపల్లి, బయ్యవరం రైల్వే రహదారులపై బ్రిడ్జిల నిర్మాణం గురించి కోరనున్నారు. గుంటూరు జిల్లాలో పలు పట్టణాల అభివృద్ధి, విస్తరణ పనులకు సంబంధించి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి చర్చించనున్నారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో కూడా స్పీకర్ ప్రత్యేకించి సమావేశం కానున్నారు.