ఆంధ్రప్రదేశ్‌

వివరాలు తెలీక ఇరుక్కుపోయాం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), జూన్ 27: సదావర్తి సత్రం భూముల కుంభకోణంపై ఆంధ్రప్రదేశ్ కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం విలేఖరులతో మాట్లాడుతూ భూముల వేలంపాటకు తన కుమారుడు, అతని వ్యాపార భాగస్వాములు వెళ్లారని, ఈ వ్యవహారంలో వివరాలు తెలియక ఇరుక్కుపోయామన్నారు. సత్రం భూములన్నీ అన్యాక్రాంతం అయ్యాయని, పైగా కోర్టు వివాదాలు ఉన్నాయన్నారు. వేలంపాటలో నిబంధనల మేరకే భూములు కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఎకరా రూ.6.5 కోట్లు విలువ చేస్తుందని ఎండోమెంట్ అధికారి తేల్చిన విషయం తమకు తెలియదన్నారు. గుంటూరు జిల్లా అమరావతిలోని సదావర్తి సత్రానికి చెంది చెన్నై నగర సమీపంలోని 83.11 ఎకరాల విక్రయంలో చలమలశెట్టి రామానుజయ కుటుంబ సభ్యులు ముగ్గురికి, వీరితోపాటు మరో ఐదుగురికి తక్కువ ధరకు వేలంలో దక్కాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో రామానుజయ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.