ఆంధ్రప్రదేశ్‌

తిరుమలలో ఆపరేషన్ చిరుత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూన్ 27: తిరుమలలో సంచరిస్తున్న చిరుత పులులను బంధించేందుకు టిటిడి అటవీశాఖ అధికారులు ఆపరేషన్ చిరుత మొదలు పెట్టారు. ఇందులో భాగంగా శివారు ప్రాంతాల్లో సంచరిస్తున్న చిరుతలను పట్టుకునేందుకు ఈస్ట్ బాలాజీ నగర్‌కాలువ, పాచికాల్వ గంగమ్మ గుడి ప్రాంతాల్లో రెండు బోన్లు ఏర్పాటు చేశారు. గత కొద్ది రోజులుగా సుమారు నాలుగు చిరుతలు రెండు జంటలుగా తిరుమల శివారు ప్రాంతాలతోపాటు బాలాజీనగర్, డి టైప్ క్వార్టర్స్, పి ఏ సి తదితర ప్రాంతాల్లో సంచరిస్తూ స్థానికులను, భక్తులను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ఈక్రమంలో టిటిడి అధికారులకు స్థానికులు, భక్తుల నుంచి అనేక ఫిర్యాదులు అందడంతో చిరుతలను బంధించేందుకు బోన్‌లను ఏర్పాటు చేశారు. అయితే వీటిని వైల్డ్‌లైఫ్ అధికారులు పరిశీలించిన తరువాత పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయడానికి అధికారులు సిద్ధమవుతున్నారు.