ఆంధ్రప్రదేశ్‌

కెకె లైన్‌లో విరిగిపడిన కొండచరియలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతగిరి, జూన్ 27: విశాఖ జిల్లా అనంతగిరి వద్ద భారీ వర్షాలకు కొత్తవలస-కిరండోల్ రైల్వే మార్గంలో సోమవారం ఉదయం విద్యుత్ తీగలపై కొండ చరియలు విరిగిపడడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొత్తవలస-కిరండోల్ రైల్వే మార్గంలో కిముడుపల్లి-బొర్రా రైల్వే స్టేషన్ 65 నెంబర్ కిలోమీటర్ వద్ద కొండ చరియలు విద్యుత్ తీగలపై విరిగిపడ్డాయి. దీంతో విద్యుత్ తీగలు తెగిపోవడాన్ని గమనించిన అధికారులు కిరండోల్ పాసింజర్‌ను తైడా రైల్వే స్టేషన్‌లో నిలిపివేసారు. హుటాహుటిన పునరుద్ధరణ పనులు చేపట్టి తిరిగి పాసింజర్‌ను పంపించారు. రెండు గంటల పాటు పాసింజర్ నిలిచిపోవడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.